Friday 29 July 2016

అర్థం చేసుకొనే పరిణితి ప్రజలకు వుంది

తన లేఖతో విభజించారని
బిల్లు ఆమోదమైన వెంటనే సెహబాష్ అంటూ
ఐదు లక్షల కోట్లు కావాలని పలికి
ఆనక
 హోదాతో ఒరిగేదేం లేదంటూ ..
అంతకన్నా ఎక్కువ కావాలని
కేంద్రం అవన్నీ లెక్కలడగకూడదు అంటూ
హోదా ఇస్తే మోడీ ఖాతాలోకి పోతుందని ...
పోలవరం కడితే కేంద్రానికే పేరొస్తుందని
వఛ్చిన డబ్బు తన ఖాతా అభివృద్ధితో చూపిస్తూ
పట్టిసీమ , మెట్టసీమల పంపులతో పేరు కొట్టేద్దామని
మనసులో ఉన్నా
రాజ్యసభలో కాసింత హడావిడి చెయ్యకపోతే
జనం ఛీకొడతారని అనుకున్నా
తాము ఏంచేస్తున్నామో
అర్థం చేసుకొనే పరిణితి ప్రజలకు వుంది

No comments:

Post a Comment