Monday 4 September 2023

హిందూ ధర్మాన్ని బిజెపి మాత్రమె కాపాడాలా?

 తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిది సనాతన ధర్మాన్ని ఒక రోగంతో పోల్చాడు. అది కరోనా, డెంగ్యూ ల కంటే ప్రమాదకరం అంటున్నాడు .

దేశంలో మేజారిటీలుగా ఉన్న హిందువులు కానీ , దేవస్థానాలు, సంఘాలు కానీ ఒక్క ముక్క మాట్లాడలేదు. హిందువుల తరపున బిజెపి మాత్రం వకాల్తా తీసుకుంది .

బిజెపి రంగం లోకి వస్తే ఈ వ్యాఖ్యల వెనక ఉన్న దురుద్దేశం, హిందూ ద్రోహం యొక్క తీవ్రత తగ్గిపోతుంది. బిజెపిని బూచిగా చూపి ఈ అంశాన్ని బిజెపికే అంటగట్టడం మామూలు విషయం కుహానా రాజకీయ పార్టీలకి. 

ఒక దురుద్దేశంతో ఇలా హిందువులను ఇలా విమర్శించడం ప్రతీవాడికీ అలవాటు అయిపొయింది. 

హిందువులారా ఎందుకు మౌనం ..

ధర్మాన్ని కాపాడండి .. అది మిమ్మల్ని కాపాడుతుంది 

మనం ఊరుకుంటే ఇలా హిందూ ధర్మం పై దాడి ఇంకా పెరుగుతుంది ... కనీసం ధర్మ కర్తలు, పీటాదిపతులు స్పందించండి.

1 comment:

  1. ఇలా పీటలున్నోలందర్నీ స్పందించమంటే ఎలా బాబయ్యా ఇంకోమాట సెప్పండి

    ReplyDelete